|

Aditya Music Paid Huge Amount For Racha Songs

Ramcharan Rachcha audio is all set to sound on 26th of february in Kurnool. Aditya music has bagged the music rights and it is heard that Aditya Music has paid Rs1 Crore for these rights. It is big price for Telugu film music. Mani Sharma is the music director.


రామ్ చరణ్ తాజా చిత్రం 'రచ్చ'ప్రతీ విషయంలో ఏదో ఒక సంచలనానికి తెర తీస్తోంది. తాజాగా ఈ చిత్రం ఆడియో రైట్స్ భారీ మొత్తానికి అమ్మి రికార్డు క్రియేట్ చేసింది. ఆదిత్యా మ్యూజిక్ వారు ఈ భారీ మొత్తాన్ని చెల్లించి తీసుకున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలోని ఓ పాట ఇప్పటికే నెట్ లో లీక్ అయ్యి సంచలనం క్రియేట్ చేస్తోంది. ఇక ఈ చిత్రం ఆడియో విడుదల హైదరాబాద్ లో చేయటం లేదు. ఈ పంక్షన్ ని గ్రాండ్ గా అభిమానుల సమక్షంలో .. కర్నూలులో ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. మొదట వారు తిరుపతిలో ఆడియో విడుదల అనుకున్నారు కానీ అక్కడ రామ్ చరణ్ వివాహ రిసెప్షన్ పెట్టుకోవటంతో ఇలా మార్పు చేసినట్లు తెలుస్తోంది. ఈ నెల 26న ఆడియో విడుదల చేస్తారు. అలాగే ఈ చిత్రాన్ని మార్చిలో విడుదలకు ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే.

ఇక ఇప్పటికే ఒక పాటను నెట్ లో లీక్ చేసారు. ఆ పాట అందరి అభిమానాన్ని చూరగొంటోంది. మణిశర్మ స్వరపరిచన ఈ సాంగ్ సినిమా హైలెట్స్ లో ఒకటిగా చెప్తున్నారు. ఈ సాంగ్ ఇలా సాగుతుంది..."సైలెంట్ చూపులోడు...వైలెంట్ చేతలోడు ...కరెంట్ కండలోడు..హీ ఈజ్ ద మిస్టర్ తీస్ మార్ ఖాన్ ... రచ్చ... అడుగేస్తే సీడెడ్..ఆంధ్రా..నైజాం..రచ్చ...వీడు రెచ్చిపోతే ఖచ్చితంగా రచ్చ..హీఈజ్ గోయింగ్ టుబి ఎ మెగాస్టార్...హీఈజ్ గోయింగ్ టు బి ఎ గెగా స్టార్.. హీ ఈజ్ గోయింగ్ టు బి ఎ యుగా స్టార్..అంటూ మాస్ బీట్ తో ఈ సాంగ్" సాగుతుంది. మాస్ మసాలా, యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని పరాస్ జైన్, ఎన్.వి.ప్రసాద్ మెగా సూపర్ గుడ్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు.
   


Posted by Andhra Gossips on 20:25. Filed under , , . You can follow any responses to this entry through the RSS 2.0. Feel free to leave a response

Enter your email address:

Delivered by FeedBurner

Jr NTR
Pawan Kalyan Gossips
Mahesh Babu Gossips
Ram Charan Gossips